నాంపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ను అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేస్తున్నారు. 2027 చివరికల్లా ఈ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేషన్ అభివృద్ధి పనులు సాగుతున్నాయని.. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ నుంచి మెట్రో స్టేషన్కు స్కై వాక్ నిర్మిస్తామని చెప్పారు.