హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి రూ.1090 కోట్లతో కొత్తగా ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించడానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఎకో సెన్సిటివ్ జోన్ దెబ్బతినకుండా కొత్త డిజైన్లను రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం 1,942 చెట్లను తొలగించాల్సి ఉండగా.. వాటిలో సగాన్ని తిరిగి నాటుతారు. మరోవైపు.. ఏఓసీ రోడ్ల సమస్యకు పరిష్కారంగా 6 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్కు టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి.