హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు తీపి కబురు. వాహనాల పార్కింగ్ సమస్యలు తీరిపోనున్నాయి. రోడ్లపై ఎటువంటి టెన్షన్ లేకుండా వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. అందుకోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఖైరతాబాద్ జోన్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తుండగా.. త్వరలోనే నగర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.