హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం కూడలిలో అండర్పాస్ వంతెన నిర్మాణానికి ఎట్టకేలకు అనుమతులు లభించాయి. గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వాహనదారుల విజ్ఞప్తి మేరకు ధర్మోజిగూడెం వద్ద అండర్పాస్ ఏర్పాటుకు NHAI ప్రతిపాదనలు పంపగా.. తాజాగా ఆమోదం లభించింది. ప్రస్తుతం డిజైన్ పనులు జరుగుతుండగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు శంకుస్థాపన చేయనున్నారు.