హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు శుభవార్త. టోల్ రుసుములను తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు ఏప్రిల్ 1 (నేటి అర్ధరాత్రి) నుండి అమలులోకి రానుంది. తెలంగాణలో పంతంగి, కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లో చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాల వద్ద టోల్ గేట్లు ఉండగా.. అన్నిచోట్ల ఛార్జీలు తగ్గనున్నాయి.