గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసినధనియాలగుట్ట శ్మశానవాటిక, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ప్రకాష్ నగర్ డివిజన్ పర్యటనలో భాగంగా శ్మశానవాటికను సందర్శించిన ఆయన.. అక్కడ వ్యభిచారం, తాగుబోతుల వేధింపులు ఎక్కువయ్యాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బేగంపేట డివిజన్ను మల్కాజిగిరిలో కలపడం వల్ల స్థానికులకు ఇబ్బందులు పెరుగుతున్నాయని మండిపడ్డారు.