హైదరాబాద్లోని పాతబస్తీ, డబీర్పుర ప్రాంతంలో ఒక వింత ఘటన వెలుగు చూసింది. ఒక యువకుడు స్థానికులకు ఉచితంగా జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ చేశాడు. ఆ జ్యూస్ తాగిన వారంతా వెంటనే నిద్రలోకి జారుకున్నారు. అపస్మారక స్థితి నుంచి మేల్కొన్న తర్వాత అయోమయానికి గురై ఆసుపత్రుల్లో చేరారు. తాను ఖురాన్ పఠనం పూర్తి చేసినందుకు జ్యూస్ పంచుతున్నానని ఆ యువకుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఆ యువకుడి కోసం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.