హైదరాబాద్ కూకట్పల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నడిరోడ్డుపై ఎలాంటి భయం లేకుండా అతడు గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని విశాఖ నుంచి నగరానికి గంజాయిని తెప్పించి అసవరమైన వారికి ఆన్లైన్ వేదికగా అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.