హైదరాబాద్లో ఓ మహిళ తన తెలివితేటలతో సైబర్ మోసాన్ని అడ్డుకుంది. ట్రూకాలర్లో 'యాక్సిస్ బ్యాంక్' అని కనిపించిన నంబర్ నుంచి ఆమెకు కాల్ రాగా సమయస్ఫూర్తితో వ్యవహరించి మోసాన్ని అడ్డుకుంది. తన భర్త పేరు తప్పుగా చెప్పటంతో ఇది మోసమని గ్రహించి వెంటనే కాల్ పెట్టేసింది. ఈ ఘటన సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవరికీ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదనే విషయాన్ని తెలియజేస్తుంది.