అద్దెకు ఆటోను తీసుకుని తిప్పుతోన్న ఓ వ్యక్తి.. మద్యం సేవించి వాహనం నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఆ ఆటోను తమ వెంట తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ ఆటో డ్రైవర్, పోలీస్ స్టేషన్ వద్ద తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు, స్థానికులు అతడ్ని కాపాడే ప్రయత్నం చేసినా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. పోలీసుల దురుసు ప్రవర్తన వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యుల ఆరోపించారు.