తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ‘హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’(హైడ్రా) తన దూకుడును కొనసాగిస్తోంది. అక్రమార్కులకు మరోసారి చెమటలు పట్టించే చర్యకు పూనుకుంది. అక్రమంగా.. ఎలాంటి పన్నులు చెల్లించకుండా నగరంలో ఏర్పాటు చేసిన హోర్డింగులపై చర్యలు తీసుకోనుంది. వారికి ఆ ఆదివారం వరకు గడువు విధిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. లేని క్రమంలో వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.