IAS A Sharath: సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కిన ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ శరత్కు పదవి వరించింది. కార్పొరేషన్ ఛైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ఏ శరత్ను నియమిస్తూ.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కాళ్లు మొక్కడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా.. ఇప్పుడు అదే ఐఏఎస్ అధికారికి పదవిని కట్టబెట్టడం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.