ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరలు అధికంగా ఉన్నాయని, సామాన్యులకు థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదని, అందుకే ఐబొమ్మ రవికి ప్రజల మద్దతు ఉందని ఆయన అన్నారు. సీపీ సజ్జనార్పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. సైబర్ నేరాలను అరికట్టాలని సవాల్ విసిరారు.