పైరసీ కింగ్ ఐబొమ్మ రవికి పోలీసులు ఊహించని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. అతని తెలివితేటలకు ఫిదా అయిన పోలీసులు.. సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయమని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ ఆఫర్ను రవి తిరస్కరించినట్లు తెలిసింది. కరేబియన్ దీవుల్లో 'ఐ బొమ్మ' పేరుతో రెస్టారెంట్ పెట్టి, భారతీయ వంటకాలను అంతర్జాతీయంగా పరిచయం చేస్తానని రవి తెలిపాడట.