టీ20 ప్రపంచకప్లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన ఇండియా పాకిస్థా్న్ మ్యాచ్లో ఏపీ మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. టీమిండియా జెర్సీ ధరించి.. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని భారత జట్టును ప్రోత్సహిస్తూ నారా లోకేష్ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. క్రికెట్ను మించిన థ్రిల్ మరొకటి ఉండదని.. నారా లోకేష్ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ నేపథ్యంలో కొలంబో స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది.