హైదరాబాద్లోని ప్రముఖ కాచిగూడ రైల్వే స్టేషన్ పేరు వెనుక ఆసక్తికర చరిత్ర ఉంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దండయాత్ర సమయంలో ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కాచి సామాజిక వర్గం సైనికులుగా ఇక్కడ స్థిరపడ్డారు. 1916లో రైల్వే స్టేషన్ నిర్మాణం సమయంలో వారి సేవలకు సంతృప్తి చెందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, వారికి మూసీ తీరప్రాంత భూములను ఇనాంగా ఇచ్చి, వారి పేరు మీదుగా ఆ ప్రాంతానికి 'కాచిగూడ' అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.