ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. చాలా రోజుల నుంచి రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగలేదు. తాజాగా పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ, నియామకాలను ఏపీ ప్రభుత్వం చేపట్టింది. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్.. రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. అగ్నిమాపకశాఖ డైరెక్టర్కు విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.