అంతరిక్షమిషన్ కోసం ఎంపికైన తెలుగు అమ్మాయి జాహ్నవి దంగేటికి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ జాహ్నవిని అభినందించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. మరోవైపు గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాహ్నవి కుటుంబసభ్యులతో కలిసి ఆయనను కలిశారు. తన ట్రైనింగ్ కోసం ప్రోత్సాహం అందించాలని కోరారు.