ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలి ఎన్నికలపై తొలిసారిగా స్పందించారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీలో జమిలి ఎన్నికలపై స్పందించారు. దేశంలో జమిలి ఎన్నికలు జరిగినప్పటికీ ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఎక్స్ ఖాతా ద్వారా ట్వీ్ట్ చేసిన అంబటి రాంబాబు.. బీజేపీ జమిలి అంటుంటే.. చంద్రబాబు 2029లోనే ఎన్నికలు అంటున్నారని విమర్శించారు. నిజాన్ని కూడబలుగ్గొని చెప్పాలంటూ సెటైర్లు వేశారు.