ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాక్రోచ్ జనతా పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన జనసేన సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీపై స్పందించారు. చిన్న చలిచీమలు సైతం బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయన్న పవన్ కళ్యాణ్.. ఇలాంటి ఆలోచనలు చేసే వ్యక్తులు దేశ సమగ్రతను బలిచేయడానికి సిద్ధంగా ఉంటారని ఆరోపించారు. ఈ ప్రవాహంలో జనసైనికులు చిక్కుకోవద్దనే ఉద్దేశంతోనే ఢిల్లీలో సమావేశం పెట్టినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.