డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి రూ. 2 కోట్లు విరాళం అందించారు. ఆదివారం నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా జనసేనకు రూ.2 కోట్లు విరాళం అందించిన పవన్ కళ్యాణ్.. పార్టీలో తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో పనిచేసే వారికి కొత్త పేర్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్.. ఉద్యమి, సాధక్, ప్రదాత అంటూ మూడు పేర్లను ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను, శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.