జనసేన పార్టీ కీలక ప్రకటన జారీ చేసింది. పార్టీ ముఖ్య నేతలను, నాయకులను ఉద్దేశించి కీలక ప్రకటన ఇచ్చింది. పార్టీ లైన్ దాటి ప్రవర్తించవద్దని.. ఎవరైనా హద్దు మీరి మాట్లాడితే కఠిన చర్యలు ఖాయమని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు జనసేన అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. అయితే జనసేన పార్టీ ప్రకటన ఎవరిని ఉద్దేశించి అనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికకరంగా మారింది. అయితే గురువారం జనసేనకు చెందిన ఓ నేత చేసిన ట్వీట్ వైరల్ కాగా.. ఈ ప్రకటన ఆయనను ఉద్దేశించి చేసిందేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.