హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తొలిసారిగా వినియోగించిన డ్రోన్లను కొందరు ఆకతాయిలు గాలిపటాల సాయంతో కూల్చివేశారు. ఈ ఘటనతో ఈసీకి భారీగానే నష్టం వాటిల్లింది. ఒక్కో డ్రోన్ ఖరీదు రెండున్నర లక్షల రూపాయలు. దీంతో ఈసీకి సుమారుగా రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఇక కొన్ని ప్రాంతాల్లో కొందరు ఆగంతకులు పైలెట్ల చేతుల్లో నుంచి డ్రోన్లను లాక్కునేందుకు ప్రయత్నించారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే డ్రోన్ల వినియోగంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.