హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తొలిసారిగా వినియోగించిన డ్రోన్లను కొందరు ఆకతాయిలు గాలిపటాల సాయంతో కూల్చివేశారు. ఈ ఘటనతో ఎన్నికల పర్యవేక్షణలో అత్యాధునిక సాంకేతికత వినియోగం ఆటంకానికి గురైంది. డ్రోన్ల కూల్చివేతపై అధికారులు సీరియస్గా స్పందించి, నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.