జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే మొగ్గు చూపే అవకాశం ఉంది. అనేక సంస్థల అంచనాల ప్రకారం.. అధికార కాంగ్రెస్ పార్టీ లేదా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ల మధ్యే విజయం దోబూచులాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ పోలింగ్ శాతం కారణంగా పోల్స్ అంచనాలలోనూ కొంత భిన్నత్వం కనిపించనుంది. తుది ఫలితం ఈ నెల 14వ తేదీన తెలుస్తుంది.