దివ్యాంగులకు తీపికబురు.. దివ్యాంగులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఉచితంగా సహాయ పరికరాలు అందించనున్నారు. ఇందుకోసం మూడు రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి మంగళవారం వరకూ మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నారు. అయితే ఇది కేవలం వైఎస్సార్ కడప జిల్లాలోని దివ్యాంగులకు మాత్రమే. కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, మరో కృత్తిమ అవయవాల తయారీ సంస్థ కలిపి ఈ ప్రత్యేక శిబిరాలను మండలాల వారీగా ఏర్పాటు చేస్తున్నాయి.