Kadapa: మేయర్ ఇంటిపైకి చెత్త.. కడప రెడ్డెమ్మ వార్నింగ్ ఇచ్చిన రెండు రోజులకే..

9 months ago 15
కడపలో చెత్త సేకరణపై రాజకీయం వేడెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి హెచ్చరించిన ప్రకారమే.. టీడీపీ నేతలు మేయర్ ఇంటి ముందు చెత్త వేసి ఆందోళనకు దిగారు. చెత్త సేకరణలో మేయర్ జాప్యం చేయిస్తారని ఆరోపిస్తూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అటు మేయర్ సురేష్ బాబుకు మద్దతుగా వైసీపీ శ్రేణులు చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని.. టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించివేశారు. అయితే టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ మేయర్ సురేష్ బాబు.. వైసీపీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
Read Entire Article