తిరుమల కల్తీ నెయ్యి కేసులో డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగలింది. ఈ కేసులో అతడు ఏ34 నిందితుడిగా ఉండగా.. సిట్ అధికారులు తనను అరెస్టు చేస్తారన్న భయంతో హైకోర్టులో మందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం వాదనల అనంతరం పిటిషన్ను డిస్మిస్ చేసింది. సిట్ విచారణకు సహకరించాలని సూచించింది.