ఏపీ, తెలంగాణకు చెందిన నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఈనెల 9 నుంచి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ ర్యాలీలో ఏపీ, తెలంగాణకు చెందిన అవివాహిత యువతీ యువకులు పాల్గొనవచ్చు. అభ్యర్థులకు ఫిజికల్, మెడికల్ పరీక్షలతో పాటు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారు నాలుగేళ్ల పాటు వైమానిక దళంలో సేవలందించాల్సి ఉంటుంది.