ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక.. మృత్యువుతో పోరాటంలో ఓడిపోయింది. మైనర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. బద్వేల్ పట్టణానికి చెందిన ఇంటర్ విద్యార్థినిపై శనివారం విఘ్నేశ్ అనే యువకుడు ఆమెపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కూడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, తక్షణమే నిందితుడ్ని అరెస్ట్ చేయాలని ఆదేశించింది.