కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు వాయిదాపడింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన జూన్ 11న హాజరుకానున్నారు. మాజీ మంత్రి హరీశ్రావు మాత్రం జూన్ 9న విచారణకు హాజరయ్యారు. ఆయన తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్తో వెళ్లారు. అక్కడ పోలీసులకు, బీఆర్ఎస్ లీగల్ టీమ్కు మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. విచారణ అనంతరం.. హరీశ్రావు కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు, రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపనుంది.