కామారెడ్డిలో శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన చిన్నారుల అదృశ్యం కేసు విషాదాంతమైంది. శనివారం ఉదయం నుంచి ఆర్బీనగర్కు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం కాగా.. ఇద్దరి మృతదేహాలు స్థానికంగా ఉన్న పెద్దచెరువులో లభ్యమయ్యాయి. మూడో చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో చిన్నారుల తండ్రిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు శుక్రవారం నుంచి కనిపించకుండా ఉన్న మరో ఇద్దరి పిల్లల ఆచూకీ తెలియాల్సి ఉంది.