Visakhapatnam Man Died In Kashmir Terror Attack: జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో విశాఖపట్నంకు చెందిన చంద్రమౌళి, తెలంగాణకు చెందిన మనీష్రంజన్ ప్రాణాలు కోల్పోయారు. మనీష్ను టెర్రరిస్టులు కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపారు. ఘటనపై ప్రధాని మోదీ సౌదీ పర్యటనను రద్దు చేసుకుని అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.