Kavuri Sambasiva rao passed away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కావూరి సాంబశివరావు సోమవారం తుదిశ్వాస విడిచారు.. ఐదుసార్లు ఎంపీగా గెలుపొందిన కావూరి సాంబశివరావు.. ఓసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. కావూరి మరణంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.