హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. ఏడు కూడళ్ల వద్ద 14 నిర్మాణాలు చేపట్టనున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.1,090 కోట్లు కాగా, నిర్మాణానికి రూ.699.75 కోట్లు, భూసేకరణకు రూ.390.25 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే 21 ప్రభుత్వ ఆస్తులను గుర్తించారు. ప్రైవేటు భూసేకరణను కూడా వేగవంతం చేస్తున్నారు. ఆగస్టు 18 నుంచి కేబీఆర్ పరిసరాల్లో వన్వే ట్రాఫిక్ అమలు కానుంది. నిర్మాణ సమయంలో ఆంక్షలు సుమారు ఏడాదిన్నర కొనసాగవచ్చని అధికారులు తెలిపారు.