విజయవాడలో కేశినేని సోదరుల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. విశాఖలో ఉర్సా కంపెనీ భూముల వ్యవహారంపై నాని ఆరోపణలు చేయగా, చిన్ని వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనిపై నాని స్పందిస్తూ లక్ష కోట్లకు దావా వేసినా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ప్రజల సంపదను దోచుకునే వారిపై పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. బెదిరింపులకు భయపడేది లేదని కేశినేని నాని తేల్చి చెప్పారు.