హైదరాబాద్లోని కేపీహెచ్బీ ప్రైమ్ లొకేషన్లో పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మలేషియన్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న 5.87 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలంలో రూ. 43 కోట్ల అంచనా వ్యయంతో 4 బహుళ అంతస్తుల టవర్లలో 1,080 ఇళ్లను నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనుండగా.. ఏడాది వ్యవధిలోనే నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.