KTR: కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేస్తున్న యుద్ధానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మద్దతు పలికారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని.. గత కొంత కాలంగా ఎంకే స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని కేటీఆర్ పేర్కొన్నారు.