తెలంగాణ హైకోర్టు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు నోటీసులు జారీ చేసింది. మేడిపల్లి పోలీసుస్టేషన్లో నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలని కేటీఆర్, జగదీష్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతో మల్లన్న కేసు పెట్టారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. ఈ మేరకు వాదనలు విన్న న్యాయస్థానం.. మల్లన్నకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 13కి వాయిదా వేశారు.