Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేది లేదని కేంద్రమంత్రులు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పునర్నిర్మిస్తామని.. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. ఇటీవలె కేంద్ర ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.11 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించగా.. తాజాగా కేంద్రమంత్రులు విశాఖలో పర్యటించి.. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చర్చించారు. మరోవైపు.. ఎయిర్పోర్టు నుంచి స్టీల్ప్లాంట్ వెళ్లే మార్గంలో కేంద్రమంత్రుల కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది.