దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత భయాలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో.. తిరుపతిలో భారీగా గ్యాస్ సిలిండర్లను నిల్వచేయడం కలకలం రేపింది. అక్రమంగా నిల్వ చేసిన 832 సిలిండర్లను పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. తిరుపతి శివారు ప్రాంతమైన అవిలాల పంచాయతీ పరిధిలో గోగ్యాస్ పేరుతో వాణిజ్య సిలిండర్లు, గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్లు పెద్ద సంఖ్యలో నిల్వ చేశారు. అయితే ఈ గోడౌన్కు అనుమతి లేకపోవటంతో పౌరసరఫరాల శాఖ అధికారులు వీటిని సీజ్ చేశారు.