కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ఘటన తెలిసిన సంగతే. ఈ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలానికి చెందిన రమేష్ కుటుంబం కూడా సజీవ దహనమైంది. రమేష్తో పాటుగా అతని భార్యా, కొడుకు, కూతురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రోజున వీరి అంత్యక్రియలను నిర్వహించారు. అయితే అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి విజయవాడకు వెళ్తున్న రమేష్ బంధువులు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరగ్గా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.