పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలోనే దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ కొరత కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరుమలలో నిత్యాన్నదానం, లడ్డూల తయారీ కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది.