పాస్టర్ పగడాల ప్రవీణ్కుమార్ మరణం అనుమానాస్పదంగా ఉందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. దళితులు, క్రైస్తవ సమాజానికి రాష్ట్రంలో రక్షణ లేదని..ఇప్పటివరకు హోం మంత్రి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మూడు రోజులు నుంచి పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన రాజమహేంద్రవరం ఆస్పత్రి దగ్గర మీడియాతో మాట్లాడారు.. ప్రవీణ్ పగడాల మరణంపై సమగ్ర విచారణ పరిపించాలని డిమాండ్ చేశారు.