మే నెల ప్రారంభమైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చేసింది. మే నుంచి జూన్ మొదటి వారం వరకూ 50కి పైగా ముహూర్తాలు ఉండటంతో కొత్తజంటలు ఒక్కటవుతున్నాయి. దీంతో ఫంక్షన్ హాళ్ల వద్ద సందడి వాతావరణం ఉంటోంది. అయితే కొత్త జంటలకు అధికారులకు ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త జంటలు తమ వివాహాన్ని నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. వివాహ రిజిస్ట్రేషన్పై అంతగా ఆసక్తి చూపకపోవటంతో అధికారులు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉపయోగాలు వివరిస్తున్నారు. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్తున్నారు.