రాజకీయమంటే.. ఎత్తులకు పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు, మాయోపాయాలతో కూడిన ఓ ప్రపంచం.. ఆ ప్రపంచంలో రాజకీయ నేతలు చెప్పే ప్రతి మాటకు, చేసే ప్రతి పనికి, వేసే ప్రతి అడుగుకు ఓ లెక్కుంటుంది. తమ మాటలు, చేతలతో జరగబోయే పరిణామాలను ఊహించి.. తమకు ఎంతమేరకు ప్రయోజనమనేది లెక్కగట్టి.. అందుకు అనుగుణంగా నేతలు వ్యవహరిస్తుంటారు. అలాంటిది.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమీ ఆలోచించకుండానే మావిగన్ ప్రకటన చేశారా.. బుధవారం రోజున విలేకర్ల సమావేశంలో మావిగన్ గురించి జగన్ చేసిన ప్రకటన ముందస్తు వ్యూహం లేకుండా చేసిన ప్రకటన కాదు.. దాని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందులో ఐదు కారణాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.ఈ పంచతంత్ర వ్యూహంతోనే జగన్ మావిగన్ ప్రకటన చేశారని విశ్లేషిస్తున్నారు.