ఇడుపు కాయితం సినిమా టైటిల్పై కొనసాగుతున్న వివాదంపై సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి స్పందించారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కొందరు ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో బలగం సినిమాలోని మూలుగ బొక్క పదాన్ని కూడా అవహేళన చేశారని గుర్తు చేశారు. అలాగే ఏపీ పోలీసులు తెలంగాణ జర్నలిస్టు అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని విమర్శించారు.