తెలంగాణ సర్కార్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతలో 44.28 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.2,482 కోట్లను జమ చేశారు. అయితే కొందరికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో పడలేదు. మరికొందరికి రైతు భరోసా నిధులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడం కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనే అసలు రైతు భరోసా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి. ఒకవేళ రైతు భరోసా డబ్బులు రాకపోతే ఏం చేయాలి. ఎవరిని సంప్రదించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.