హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు వెళ్లే మెట్రో మార్గం అలైన్మెంట్ స్కెచ్ను సమర్పించాలని ఆదేశించింది. చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లుతుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేయగా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.