MLA MS Raju: మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు తన గొప్ప మనసును చాటుకున్నారు. గతంలో నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో.. ఓ కుటుంబం ఇల్లు లేక బాత్రూంలో నివసిస్తున్న విషయాన్ని తెలుసుకున్నారు. అప్పుడే వారికి కొత్త ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన తర్వాత 4 నెలల్లోనే.. వారికి అద్భుతమైన ఇంటిని కట్టించి.. గృహప్రవేశం కూడా చేయించారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ఎమ్మెల్యే హాజరయ్యారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర భావోద్వేగానికి గురైంది.